భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ గగన్యాన్ మిషన్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. గగన్యాన్ మిషన్కు సంబంధించిన రాకెట్లోని మూడు దశలు శ్రీహరికోటలోని షార్ రేంజ్కు చేరుకున్నాయని ఆయన శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఏజెన్సీ తన మొదటి టెస్ట్ ఫ్లైట్ను ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.