ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గంగా మాత ఆశీస్సులు పొందడానికి వచ్చినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ఘనంగా సాగుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక సినీ, రాజకీయ, క్రీడాకారులంతా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.