తెలంగాణలో ‘బంగారు బాబు’గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఆదాయపు పన్ను (IT) అధికారుల విచారణను ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు కొండ విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే.. ఆయన ప్రయాణానికి ముందే హైదరాబాద్లోని ఐటీ అధికారులు ఆయన పాన్ కార్డు వివరాలను సేకరించినట్లు సమాచారం. ఆయన ఢిల్లీ…