Gold Seized: తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ బంగారం సీజ్.. అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ‘బంగారు బాబు’గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఆదాయపు పన్ను (IT) అధికారుల విచారణను ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు కొండ విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే.. ఆయన ప్రయాణానికి ముందే హైదరాబాద్లోని ఐటీ అధికారులు ఆయన పాన్ కార్డు వివరాలను సేకరించినట్లు సమాచారం. ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అక్కడ వేచి ఉన్న నలుగురు ఐటీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
12 గంటల సుదీర్ఘ విచారణ..
Also Read
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
విజయ్ కుమార్ తన ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఉండటమే ఈ తనిఖీలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. సుమారు 12 గంటల పాటు ఆయనను విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా విచారించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన ధరించిన సుమారు కొన్ని కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధించిన కొనుగోలు రశీదులు, ఆదాయ వనరులపై ప్రశ్నలు సంధించారు. ఆయన పేరిట ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను, హోప్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న లావాదేవీలను అధికారులు ఆరా తీశారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్లడానికి ఆయనకు అనుమతినిచ్చారు. అయితే.. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
Also Read:FBI Chief Email Breached: అమెరికాకు బిగ్ షాక్.. FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్..
ఎవరీ కొండ విజయ్ కుమార్..?
హైదరాబాద్లోని శేరిలింగంపల్లికి చెందిన విజయ్ కుమార్.. తన ఒంటిపై దాదాపు 5 నుంచి 12 కిలోల వరకు బంగారం ధరిస్తూ సోషల్ మీడియాలో ‘గోల్డ్ మ్యాన్’గా ఫేమస్ అయ్యారు. ఆయన హోప్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అధికారుల తనిఖీల్లో తేలే అంశాలను బట్టి ఈ కేసు మున్ముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!