శర్వానంద్, సిద్ధార్ధ, అదితీరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’.. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటివరుకూ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘హే తికమక మొదలే ఎదసొద వినదే అనుకుందే తడవా..’ అంటూ సాగే పాటను రెండు జంటల ప్రేమగీతంగా విడుదల చేశారు. శర్వానంద్…