కరోనా ముంచుకు వస్తోంది. దేశవ్యాప్తంగా రోజూ లక్షలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ కేసుల తీవ్రత కొనసాగుతోంది. అయితే, వీరికి నిరంతరం సేవలందిస్తూ వారి రికవరీకి ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు వైద్యారోగ్య సిబ్బంది. ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలో అద్భుత మైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ట్విట్టర్ లో అభినందించారు మంత్రి హరీశ్ రావు. కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన గర్బిణికి కరోనా సోకినా,నిర్మల్…