తెలంగాణ సమాజ నిర్మాణంలో తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే హమాలీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఈ సభలో మంత్రి ప్రధానంగా హమాలీ కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించారు. నిరంతరం శారీరక శ్రమతో కూడిన పని చేసే హమాలీలకు మెరుగైన…