UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. యూకేలో భారత రాయబారిగా ఉన్న విక్రమ్ దొరైస్వామిని గ్లాస్గో గురుద్వాలోకి వెళ్లకుండా ఖలిస్తానీ వేర్పాటువాదులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారతదేశం, యూకేకి తన ఆందోళన తెలియజేసింది.
ఉత్తరాఖండ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లాలో రీతా సాహిబ్ గురుద్వారా నుండి తిరిగి వస్తున్న బస్సు బోల్తా పడడంతో పంజాబ్కు చెందిన కనీసం 25 మంది యాత్రికులు గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో ఆదివారం ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.