విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. పదికి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది.
గ్రేటర్ విశాఖ నగరం పరిధిలో కొత్త టౌన్ షిప్పులు రానున్నాయ్. ఆరువేల ఎకరాల్లో లే అవుట్ల అభివృద్ధి బాధ్యతను వీఎంఆర్డీఏకి అప్పగించింది ప్రభుత్వం. లక్షా 83వేల కుటుంబాలకు లబ్ధి చేకూరే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. జీవీఎంసీ పరిధిలో నివాస స్ధలాల కోసం ఎదురు చూస్తున్న పట్టణ పేదలకు ఊరట లభించింది.భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభివృద్ధి పనులకు యంత్రాంగం రెడీ అవుతోంది. పది మండలాల పరిధిలో ఇప్పటికే సేకరించిన…