Sharjeel Imam : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి దేశద్రోహం కేసులో షర్జీల్ ఇమామ్కు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharjeel Imam : 2020 మతపరమైన అల్లర్ల కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. షర్జీల్ ఇమామ్ 13 డిసెంబర్ 2019 న జామియా మిలియా ఇస్లామియాలో, 16 డిసెంబర్ 2019 న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తన ప్రసంగంలో అస్సాం, మిగిలిన ఈశాన్య ప్రాంతాలను దేశం నుండి నరికివేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ షార్జీల్ ఇమామ్పై కేసు నమోదు చేసింది. అతను జనవరి 28, 2020 నుండి కస్టడీలో ఉన్నాడు. కేసు నడుస్తున్న సెక్షన్ల ప్రకారం గరిష్టంగా 7 సంవత్సరాలు శిక్ష పడుతుందని, అందులో సగం శిక్షను ఇప్పటికే అనుభవించానని షార్జీల్ ఇమామ్ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి అతనికి చట్టబద్ధమైన బెయిల్ ఇవ్వాలి. సగానికి పైగా శిక్ష అనుభవించినప్పటికీ తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన ట్రయల్ కోర్టు ఆదేశాలను షార్జీల్ ఇమామ్ హైకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం.. ఇమామ్, ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది విన్నవించిన తర్వాత, అప్పీలుదారుకు బెయిల్ మంజూరు చేయవచ్చని తెలిపింది.
Also Read
Read Also:Ramajogayya Sastry : దేనికైనా కాస్త ఓపిక, సహనం ఉండాలి.. వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ట్వీట్..
షర్జీల్ ఇమామ్ 13 డిసెంబర్ 2019 న జామియా మిలియా ఇస్లామియాలో, 16 డిసెంబర్ 2019 న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తన ప్రసంగంలో అస్సాం, మిగిలిన ఈశాన్య ప్రాంతాలను దేశం నుండి నరికివేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయానికి సంబంధించి, ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ మొదట షార్జీల్ ఇమామ్పై దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఆ తర్వాత అతడిపై యూఏపీఏ సెక్షన్ 13 కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో అతను 28 జనవరి 2020 నుండి కస్టడీలో ఉన్నాడు.
ఎలాంటి వాదనలు ఇచ్చారు?
షార్జీల్ ఇమామ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తఫా మాట్లాడుతూ, షర్జీల్ ఇప్పటికే గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్షలో నాలుగు సంవత్సరాల ఏడు నెలల శిక్ష అనుభవించాడని చెప్పారు. అయితే, షర్జీల్ ఇమామ్ సగం శిక్షను అనుభవించలేదన్న కారణంతో నాయర్ పిటిషన్ను వ్యతిరేకించారు. షర్జీల్ ఇమామ్ కేసు పూర్తిగా క్రిమినల్ ప్రొసిజర్ సెక్షన్ 436A కిందకు వస్తుందని, అందువల్ల అతను చట్టబద్ధమైన బెయిల్కు అర్హుడని చెప్పాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్ 22 కింద షర్జీల్ ఇమామ్పై కేసు నమోదు చేసింది. తొలుత దేశద్రోహ నేరం కింద కేసు నమోదు కాగా, ఆ తర్వాత యూఏపీఏ సెక్షన్ 13 విధించారు.
Read Also:Group 1 : గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్
తాజావార్తలు
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
-
Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
-
India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
-
Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!