పశ్చిమాసియా కాల్పుల విరమణ ఒప్పందం వేళ మగువలకు భారీ షాక్ తగిలింది. మధ్యప్రాచ్యం యుద్ధం జరిగినంత కాలం పసిడి ధరలు దిగొచ్చాయి. తాజాగా ఇరాన్తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కానీ బంగారం, వెండి ధరలు మాత్రం హడలెత్తిస్తున్నాయి.
2025 దీపావళి సమయంలో ఉవ్వెత్తున ఎగసిన బంగారం ధరలు కొన్ని రోజులుగా దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, గోల్డ్ పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో.. దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి.. భారతదేశంలోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మరలా షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.76 పెరిగి.. రూ.12,158గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1…