ఇండోనేషియాలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్గా భారత్కు చెందిన గీతా సబర్వాల్ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ నియమించారు. సోమవారం తన పదవిని చేపట్టిన సభర్వాల్.. వాతావరణ పరివర్తన, స్థిరమైన శాంతి, పాలన, సామాజిక విధానానికి మద్దతు ఇచ్చే అభివృద్ధిలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.