Pune: మహారాష్ట్ర పూణేని గుల్లెయిన్-బారే సిండ్రోమ్(GBS) వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 54 కేసులు నమోదైనట్లు పూణే డివిజనల్ కమిషనర్ డాక్టర్ చంద్రకాంత్ పుల్కండ్వర్ తెలిపారు. మరో నలుగురికి ఈ అరుదైన నాడీ రుగ్మత ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్లో 24 మందికి జీబీఎస్తో బాధపడుతున్నట్లు పలు ఆస్పత్రులు నివేదించిర తర్వాత, డాక్టర్ పుల్కండ్వర్ రాష్ట్ర, జిల్లా ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు.