గాజాలో పరిపాలన కోసం శాంతి మండలి (Board of Peace) ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరాలని దాదాపు 50 దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. భారతదేశంతో పాటు రష్యా, ఫ్రాన్స్.. ఇలా అగ్ర రాజ్యాలతో పాటు ముస్లిం దేశాలను ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఈ బోర్డ్ ఆఫ్ పీస్పై అగ్ర రాజ్యాల మధ్య రగడ నడుస్తోంది.