తాను కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేయడమే ఆలస్యం.. అతడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడా? అనే చర్చలు జాతీయంగా మొదలైపోయాయి. ఆల్రెడీ గంగూలీ పలుసార్లు కేంద్ర హోంమంత్రిని కలవడం, ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ఆయన రావడంతో.. గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని, ఆయన బీజేపీలో చేరనున్నారని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. అతని చేసిన ట్వీట్లో ‘చాలామందికి ఉపయోగపడే ఓ మహత్తర కార్యక్రమానికి తెరతీస్తున్నా’ అని పేర్కొనడం.. రాజకీయ అరంగేట్ర ప్రచారానికి మరింత…