నటరత్న యన్.టి.రామారావు హీరోగా దర్శక-నిర్మాత బి.ఆర్.పంతులు తమ పద్మినీ పిక్చర్స్ పతాకంపై జనరంజకమైన చిత్రాలు రూపొందించారు. వాటిలో ‘గాలిమేడలు’ ఒకటి. 1962 ఫిబ్రవర 9న విడుదలైన ‘గాలిమేడలు’ విశేషాదరణ పొందింది. ఇందులో దేవిక నాయికగా నటించగా, యస్.వి.రంగారావు, చిత్తూరు నాగయ్య కీలక పాత్రలు పోషించారు. ‘గాలిమేడలు’ కథ విషయానికి వస్తే – రంగనాథం అనే షావుకారు టీబీ రోగంతో బాధపడుతూ ఉంటారు. తాను చికిత్స నిమిత్తం వెళ్తూ, తన కొడుకు కృష్ణ ఆలనాపాలనా పానకాలు అనే నమ్మకస్థునికి…