తెలంగాణ రైతులకు సాగు ఖర్చు తగ్గించి, ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రైతులకు అత్యంత అవసరమైన యూరియాను ఉచితంగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. సాగులో కీలకమైన యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ‘రైతు భరోసా’…