Free Electricity: ఆంధ్రప్రదేశ్ సర్కార చేనేత కార్మికులకు మరో శుభవార్త అందించింది. ఇవాళ్టి నుంచి చేనేతల కోసం ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నేతన్నలకు ఆర్థిక ఉపశమనం లభించనుంది. అమరావతిలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం, మగ్గం నేతన్నలకు నెలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గం (పవర్లూమ్) నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీంతో చేనేత రంగంలో పనిచేసే కార్మికులపై…