ఈద్-ఉల్-అజా పండుగ సందర్భంగా.. సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. అయితే.. సౌదీ అరేబియాలో తీవ్రమైన ఎండలు, వేడితో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హజ్ సమయంలో 47 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. మక్కాలో విపరీతమైన వేడిమి కారణంగా ఆరుగురు మరణించారు.