వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో ఆడిపాడుతున్నారు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. గణేష్ శోభాయాత్ర వాహనంలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు డ్యాన్స్ చేస్తున్న వారు గాయాలతో పడి ఉన్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.