విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఎడ్-టెక్ సంస్థ బైజూస్ ఎండీ, సీఈవో బైజు రవీంద్రన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సోదాలు నిర్వహించింది.
రెండో రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు. నిన్న మంచిరెడ్డిని 8 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఢించారని ఆరోపణలపై మంచిరెడ్డి విచారిస్తున్న ఈడీ.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ షియోమీకి షాక్ఇచ్చింది.. ఏకంగా రూ.5,551.27కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది ఈడీ.. చైనాకు చెందిన షియోమీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన షియోమీ ఇండియా.. 2014 ఏడాది నుంచి భారత్లో కార్యకలాపాలు సాగిస్తుంది.. కానీ, భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది నుంచే.. అంటే 2015 ఏడాది నుంచే ఆ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి..…