వికారాబాద్ జిల్లాలో పరిగిలో రైతులు ఆంధోళనలకు దిగారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. పండించిన వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధోళనలు చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రైతులు బైఠాయించారు. రోడ్డుపై రాళ్లు పెట్టి వాహనాలను ఆపేశారు. దీంతో దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. కలెక్టర్ వచ్చి స్ఫష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం…
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు నిధుల విషయంలో…
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్లో…
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం లోడ్ కోసం వచ్చిన లారీని అడ్డుకున్నారు రైతులు. సన్నరకం ధాన్యాన్ని కాంటాలు పెట్టకుండా దొడ్డు రకం ధాన్యాన్ని లోడ్ చేయించేందుకు వచ్చిన అధికారులతో పాటు లారీని అడ్డుకున్నారు రైతులు. లారీ టైర్ కింద పడుకుని నిరసన వ్యక్తం చేసారు ఓ రైతు. వెంటనే సన్నరకం ధాన్యం కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యనిర్వహణ అధికారిపై…
తెలంగాణలో ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతుండగా మరోవైపు రైతులు ఆంధోళనలు చేస్తున్నారు. తెలంగాణలోని తుఫ్రాన్ మండలంలోని యానాపూర్ లో రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆంధోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు నిరసనలు చేస్తున్నారు. పంటను రోడ్లపై పోసి తగలబెట్టారు. దీంతో గజ్వేల్-తుఫ్రాన్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాక్ సడలింపుల సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని లేదంటే ఆంధోళనలు ఉదృతం చేస్తామని…
రాష్ట్రంలో 7 వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. నిన్న సాయంత్రం వరకే 77 శాతం ధాన్యం కొనుగోలు చేశాం అని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 90 లక్షల మంది రైతుల వద్ద…11వేల 500 కోట్ల విలువైన 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేశాం. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేటలో ధాన్యం లేక కొనుగోలు కేంద్రాలు మూసివేశాము అన్నారు. ఒకటి రెండు…
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో ఆమోదించుకున్న “మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు” రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై నేటికి ఆరు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పట్ల మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ, “సంయుక్త కిసాన్ మోర్చా” మే 26 వ తేదీన “బ్లాక్ డే” నిర్వహించాలని పిలుపునిచ్చారు.…
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని.. ఈ నెలలోనే రైతుల కోసం రైతు భరోసా కింద నేరుగా వారి ఖాతాల్లోకి 3,928 కోట్లు పంపామని.. ఇదే నెలలోనే 15.5 లక్షల మందికి రైతులకు మేలు జరిగేలా రూ.1820.33 కోట్లు ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెలలోనే…
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని..కుంభకర్ణ నిద్ర వీడి రెండు హస్పిటల్స్ ను విజిట్ చేసి.. 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందారని ఎద్దేవా చేశారు. ఎద్దు ఎడిసిన వ్యవసాయం…రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని కెసిఆర్ అన్నారని..మరి ఇప్పుడు తెలంగాణ రైతు ఎడుస్తున్నారు…ఉచిత ఎరువులు ఇస్తానన్న సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రైతుబంధు ఎక్కడికి…
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు….…