బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ & సీఈవోగా రతన్ కుమార్ కేష్ను బ్యాంక్ నియమించింది. ప్రస్తుత ఎండీ & సీఈవో అయిన చంద్ర శేఖర్ ఘోష్ జూలై 9, 2024న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో ఈ నెల 10 నుంచి రతన్ కుమార్ తాత్కాలిక ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టానున్నారు.
India.. world's start-up capital: భారతదేశం ప్రపంచ స్టార్టప్ల రాజధానిగా ఎదుగుతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ డైరెక్టర్ సంగీత బవి అన్నారు. ఇండియాలో ఒక వ్యాపారవేత్తగా ఉండటానికి ఇది సరైన సమయమని చెప్పారు. భారతదేశం సాంస్కృతికపరంగా కూడా చాలా మార్పులకు లోనవుతోందని, ఎంట్రప్రెన్యూర్షిప్ వైపు శరవేగంగా దూసుకుపోతోందని తెలిపారు. సొంత స్టార్టప్లను బిల్డ్ చేయాలనుకునేవారికి మైక్రోసాఫ్ట్ ఏవిధంగా సాయపడుతోందో ఆమె వివరించారు.