ప్రయాణికుల కోసం ఈయూ గ్రీన్ పాస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. వివిధ దేశాల ప్రయాణికులు ఈయూదేశాల్లో ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి నేసథ్యంలో టీకా తీసుకున్న వారికి ఈ విధానం వర్తిస్తుంది. అయితే, నాలుగు రకాల టీకాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ గ్రీన్ పాస్లు వర్తిస్తాయని మొదట పేర్కొన్నది. మోడెర్నా, ఫైజర్, అస్త్రాజెనకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు మాత్రమే గ్రీన్ పాస్ లు ఇస్తామని తెలిపింది. …
ఆక్స్ఫర్ట్-అస్త్రాజెనకా సంయుక్తంగా అభివృద్దిచేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ఇండియాలో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, జులై 1 వ తేదీ నుంచి ఈయూ గ్రీన్ పాస్లను జారీ చేయబోతున్నది. గ్రీన్ పాస్లకు అర్హత కలిగిన వాటిల్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ పేరు లేకపోవడంతో సీరం సంస్థ షాక్ అయింది. దీంతో ఈయూలో ప్రయాణం చేసే భారతీయులకు గ్రీన్ పాస్ లభించే అవకాశం…