గతేడాది ఖుర్దిష్ యువతి 22 ఏళ్ల మహ్స అమిని పోలీస్ కస్టడీలో మరణించింది. హిజాబ్ ధరించలేదనే ఆరోపణలపై అక్కడి మోరాలిటీ పోలీసులు మహ్సా అమినిని అరెస్ట్ చేసి, కొట్టారు. దీంతో ఆమె కస్టడీలోనే మరణించారు. ఆమె మరణంతో యావత్ ఇరాన్ ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్లోని అయతుల్లా అలీ ఖమేని ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంది.