హర్యానా ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని ప్రధాని మోడీ అన్నారు. హర్యానాలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్క్వార్టర్స్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
INDIA bloc: ప్రతిపక్షాల ఇండియా కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 19న ఢిల్లీ వేదికగా కూటమి నాలుగో సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షత వహించబోతోంది. ముందుగా ఈ సమావేశాన్ని గత బుధవారం నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే కీలక నేతలైన సీఎం మమతాబెనర్జీ, సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి వారు గైర్హాజరు అయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీని రద్దు చేశారు.
PM Modi: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు.