పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో, ఎయిర్ ఇండియా మే 31 వరకు ఇజ్రాయెల్కు తన విమాన సర్వీసులను నిలిపివేసింది. చాలా ప్రధాన విమానయాన సంస్థలు టెల్ అవీవ్ మార్గంలో తమ సేవలను నిలిపివేశాయి. ఎల్ అల్, ఇస్త్రా ఎయిర్, ఆర్కియా, ఎయిర్ హైఫా వంటి ఇజ్రాయెల్ విమానయాన సంస్థలు మాత్రమే కఠినమైన ఆంక్షల మధ్య పనిచేస్తున్నాయి. Also Read:BCB: బంగ్లాదేశ్ క్రికెట్లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్పై తీవ్ర ఆరోపణలు…
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ మిలిటెంట్లను రాక్షసులతో పోల్చారు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.