పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో డేటా సైన్స్ ప్రోగ్రామ్ కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యా రుణాలు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు తప్పుడు వాగ్దానాలు చేసి ఆ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ఆ సంస్థ సీఈవోపై ఆరోపణలు ఉన్నాయి.