China : చైనాలో ఇటీవల సంభవించిన భూకంపం వినాశనానికి కారణమైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వందలాది మంది గాయపడ్డారు. ఇంతలో కొత్త సంక్షోభం తలెత్తింది.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లోని లూడింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 74కి చేరుకుందని స్థానిక మీడియా బుధవారం నివేదించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.