ఓ మహిళ కార్మికురాలు.. బాటిళ్లను క్లీన్ చేసే ఫ్యాక్టరీలో పని చేస్తుంది. అయితే పని చేస్తున్న సమయంలో ఆమెకు దాహం వేయడంతో దీంతో తన తోటి కార్మికురాలుని నీళ్లు ఇవ్వాలని కోరింది. అయితే, ఆమె చూసుకోకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చింది.. దాన్ని మంచి నీళ్లు అనుకుని సదరు మహిళ తాగేసింది. దీంతో ఒక్కసారిగా నోటిలో విపరీతమైన మంట ప్రారంభమైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.