సెప్టెంబర్ 8న ప్రధాని మోడి ఎన్డీయే ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఆతిథ్యమే కాదు ఎన్డీయేలోని అన్ని పార్టీలకు ఐక్యత సంకేతం ప్రధాని ఇచ్చే విందు ద్వారా ఇవ్వనున్నారు. విందు సమయంలో రాజకీయ చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికతో పాటు రాబోయే రాష్ట్రాల ఎన్నికలపై చర్చిస్తారు.
కాంగ్రెస్ అసమ్మతి నేతల డిన్నర్ సమావేశం హాట్ హాట్ గా సాగుతోంది. గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల “డిన్నర్ సమావేశం పార్టీలో సోనియా విధేయులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అజాద్ నివాసంలో “డిన్నర్ సమావేశానికి” హాజరయ్యారుకపిల్ సిబల్, శశి థరూర్, మనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, రాజ్ బబ్బర్, పి.జే.కురియన్, మణిశంకర్ అయ్యర్. అదనంగా ఈ రోజు “అసమ్మతి నేతల…