Home
Diesel
Diesel News
-
Srilanka Tension: శ్రీలంకలో ఉద్రిక్తతకు దారితీసిన నిరసనలు
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకను నిరసనలు చుట్టుముడుతున్నాయి. శ్రీలంక ప్రజలు తీవ్ర అసహనంతో వున్నారు. తీవ్ర ఘర్షణలకు దారితీశాయి పెట్రోలు, డీజల్ ధరల పెంపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న రైల్వే ట్రాక్ పట్టాలు తొలగించారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న పోలీసు స్టేషన్ పై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళన కారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు వర్షం కురిపించారు పోలీసులు. ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయాల… -
Fuel Sales: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం.. గ్యాస్ది అదే దారి..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు.. వివిధ వస్తువల ధరలు, వంటనూనె ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.. అన్నింటి పెరుగుదలపై పెట్రో ధరల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట… పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో.. రవాణా ఛార్జీలు పెరిగి.. దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని వెల్లడిస్తున్నారు.. అయితే, ఈ నెలలో ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.. మార్చి 2022… -
Petrol Price: 13 రోజుల్లో 11వ సారి పెట్రో ధరల మంట
ఒకవైపు కరోనా సంక్షోభం నుంచి ఇంకా బయటపడని సామాన్యులపై ప్రభుత్వాలు ధరల భారం మోపుతూనే వున్నాయి. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే వుంది. ఎండలు పెరుగుతున్నట్టే పెట్రో మంల కూడా కొనపాగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం గత 13 రోజుల్లో ఇది 11వ సారి. తాజాగా లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్పై 87 పైసలు… -
Ukraine Russia War: పెట్రోల్పై రూ.20, డీజిల్పై రూ.15 వడ్డింపు..
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా వార్… జఠిలసమస్యగా మారింది. రష్యా-ఉక్రెయిన్లో ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్పై రూ.20, డీజిల్ రూ.15లను ఒక్కసారిగా పెంచేశాయి.… -
TSRTC: ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్న ఆర్టీసీ బస్సులు…
తెలంగాణ ఆర్టీసీని డీజిల్ కొరత వేధిస్తున్నది. గతంలో ప్రభుత్వం డీజిల్పై రూ. 7 రూపాయలు సబ్సీడీ ఇస్తున్నది. డీజిల్పై సబ్సిడీ రావడంతో ఆర్టీసీ పెద్ద ఎత్తున డీజిల్ను కొనుగోలు చేసింది. అయితే, ఫిబ్రవరి 16 నుంచి ఈ సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది. సబ్సిడీని ఎత్తివేయడంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ బంకులను ఆశ్రయించారు. ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ను ఫిల్ చేయిస్తున్నారు. ఖమ్మం డిపో నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బంకుల వద్ద క్యూలు… -
Andhra Pradesh: ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధర భారీగా పెంపు
ఏపీలో ఆర్టీసీకి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. సాధారణంగా నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీకి చమురు కంపెనీలు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు డీజిల్ను సరఫరా చేస్తుంటాయి. అయితే 10 రోజులుగా బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ ధర రూ.4.30 వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీపై రూ.10 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్… -
Oil Crisis: నిండుకున్న చమురు నిల్వలు… చేతులెత్తేసిన సర్కార్…
శ్రీలంకలో చమురు సంక్షోభం నెలకొన్నది. దేశంలో చమురు నిల్వలు అడుగంటాయి. లంకలోని అనేక ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఆర్థికంగా ఆ దేశం చాలా నష్టపోయింది. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురును దిగుమతి చేసుకోవడానికి కూడా ఆ దేశం వద్ద నిధులు లేకుండా పోయాయి. ఇటీవలే రెండు షిప్పుల్లో చమురు శ్రీలంకకు… -
ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… లీటర్ పెట్రోల్పై రూ. 25 తగ్గింపు…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరలు వంద దాటిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ. తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తగ్గించని ధరలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధరలను తగ్గించాయి. ఇక ఇదిలా ఉంటే, ఝార్ఖండ్ ప్రభుత్వం వాహనదారులకు మరో గుడ్న్యూస్ను… -
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఆ వాహనాలు బ్యాన్…
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2022 నాటికి పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదేళ్లు పైబడిన అన్ని డీజిల్ వాహనాలను ఇకపై డీరిజిస్టర్ చేస్తామని ప్రకటించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. డీరిజస్టర్ అయిన డీజిల్ వాహనాలకు ఎలాంటి ఎన్ఓసీ జారీచేయబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతుండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దశల వారీగా… -
‘పెట్రో’ఎక్సైజ్ సుంకం.. కేంద్రం వాటా ఎంత..? రాష్ట్రాలకు వచ్చేదెంత..?
సామాన్యుడి నడ్డి విరిచేలా.. ప్రతీ వస్తువుపై ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో భారం పడేలా పెట్రో ధరలు వరుసగా పెరిగిపోయాయి.. అయితే, దీపావళికి ముందు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం.. ఆ తర్వాత క్రమంగా బీజేపీ పాలిత, ఎన్డీయే పాలి రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గించాయి.. అంతే కాదు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కూడా తగ్గించాల్సిందేనంటూ ఒత్తిడి పెరిగుతోంది.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.. అయితే,…
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!