నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా సాధికారిత దిశగా దేశం చారిత్రాత్మక అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎక్స్లో కీలక ట్వీట్ చేశారు.
దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు దిశగా మోడీ ప్రభుత్వం వెళ్తోంది. నారీమణులకు పెద్ద పీట వేస్తూ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుంది. దేశ రాజకీయాల్లోనే ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.