Dussehra 2025: విజయదశమి సందర్భంగా ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో రావణ దహన వేడుకలకు వర్షం అంతరాయం కలిగించింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా, ఢిల్లీ, పాట్నా, జౌన్పూర్తో సహా అనేక నగరాల్లో ఆకస్మిక వర్షాలు మైదానంలో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలను తడిపేశాయి. నోయిడాలోని రాంలీలా మైదానంలో భారీ వర్షం ప్రారంభమవడంతో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలు నీటితో తడిసిపోయాయి. దిష్టిబొమ్మలను చూడటానికి చాలా మంది జనాలు వచ్చారు. కానీ వర్షం వారు మైదానం వదిలి ఇంటికి వెళ్లిపోయారు.