Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు…
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్కసారిగా భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గురుగ్రామ్లతో పాటు పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కార్గిల్ ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాలు ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం.. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని దరావన్ సమీపంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూ…
ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. దాని ప్రకంపనలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఢిల్లీ-NCRలో సంభవించాయి. దీనితో పాటు, పాకిస్తాన్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. బలమైన భూకంపం కారణంగా కనీసం 9 మంది మరణించారని, 15 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ నంగర్హార్ ప్రజారోగ్య శాఖ ప్రతినిధి నకిబుల్లా రహీమి రాయిటర్స్తో తెలిపారు. Also Read:Ganesh…
ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. రాజధానిలో 24 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదైంది. దీని కేంద్రం హర్యానాలోని ఝజ్జర్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి 7.49 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. హర్యానాలోని రోహ్తక్, బహదూర్గఢ్ జిల్లాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. నిన్న(గురువారం) కూడా ఢిల్లీ-ఎన్సిఆర్లో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉదయం 9:04 గంటలకు సంభవించింది. దీని తీవ్రత 4.1గా…