దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఢిల్లీ ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా సాగుతున్నది. ఈ క్రమంలో ఉదయం తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.…