వరుసగా దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది… ఇవాళ ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్లో భారీగా హెరాయిన్ను పట్టుకున్నారు అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు ఆఫ్రికన్ ప్రయాణికుల నుంచి 120 కోట్ల విలువ చేసే 18 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచారు కేటుగాళ్లు… మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు గుర్తు పట్టకుండా బుట్టలలో దాచి…
డ్రగ్స్ రవాణాలో ఇప్పుడు ఏకంగా విమానాలను ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుండి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్ డ్రగ్ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు కేటుగాడు. ఢిల్లీ విమనాశ్రయంలో ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని లగేజ్ బ్యాగ్ను క్షుణంగా తనిఖీ చేసింది…