ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… కోవిడ్పై పోరాటంలో భాగంగా భారత్లో ఇప్పటికే 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దాదాపు 43 కోట్ల మందికి టీకా వేశారు. ఇక, 18 ఏళ్లు లోపు వారికి వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడూ..? అని అంతా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.. పిల్లల కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతున్నా.. థర్డ్ వేవ్ భయాలు మాత్రం వెంటాడుతున్నాయి.. అయితే, దేశంలో అక్టోబర్ చివరి నాటికి చిన్నారులకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి రెండేళ్లు పైబడిన వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి… థర్డ్ వేవ్లో చిన్నారులపై కరోనా అధికంగా ప్రభావం చూపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. పిల్లలపై కోవ్యాక్సిన్ ట్రయల్స్ను భారత్ బయోటెక్ ప్రారంభించిందని ఇండియన్ కౌన్సెల్…