కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నియోజవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల కృతజ్ఞత సభ, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వారు తరువాత ఎన్నికలలో ఓడిపోతారనే పుకారు ఉండేది.. గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారు అందరూ ఓడిపోయారు.. కానీ బాన్సువాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో చరిత్ర తిరగరాసానని పోచారం తెలిపారు. తెలంగాణ…
Congress: పార్లమెంట్లో భద్రత ఉల్లంఘనపై విపక్షాలు, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఛాంబర్లోకి ప్రవేశించి, ఎల్లో రంగులో పొగను వెదజల్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు పార్లమెంట్లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన…
Congress: బీజేపీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సీఎంలుగా కొత్తవారిని నియమించడంపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల ఎంపికపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ మార్గంలో నడుస్తున్నారంటూ పేర్కొన్నారు.
PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలను కష్టాలకు గురిచేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి అన్నారు చేయలేదని విమర్శించారు. మరోవైపు.. కిషన్ రెడ్డి ఆరు గ్యారెంటీస్ అమలు చేయరు అని అంటున్నారు.. కర్ణాటక వెళ్లి చూడాలని తెలిపారు. కొందరు ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు అని మాట్లాడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.. ఏమైందని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
ఎల్.బి నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు తొందర పడి మాట్లాడొద్దని సూచించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తీసుకొద్ధామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని హుందాగా స్వీకరిద్ధామని సుధీర్ రెడ్డి…
Minister Ponnam Prabhakar Visits Husnabad Govt Hospital: ఏ సమస్యలు ఉన్నా మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవవచ్చు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తా అని హామీ ఇచ్చారు. హుస్నాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోందని, కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి…
Kothakota Srinivas Reddy appointed as Hyderabad CP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐపీఎస్ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు మంగళవారం జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా…