Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 10న) పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగనుంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది.. కొండ దంపతులకు ఎమ్మెల్యేలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాలతో రెండు వర్గాలు ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రేపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు గాంధీ భవనకు వచ్చి కలవాలంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి కోరారు..