ఒడిశాలోని జాజ్పూర్లో కీటకాల గుంపు వాహనదారులను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద ఎత్తున కీటకాల దండు తరలిరావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్లల్లో పడడంతో బైకర్లు బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.