కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్కు వెళతారని సమాచారం.
Kamareddy: కామారెడ్డిలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలే కాకుండా, దేశం మొత్తం కామారెడ్డి నియోజకవర్గంపై ఆసక్తి కనబర్చాయి. సీఎం కేసీఆర్తో పాటు కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిగా చెప్పబడుతున్న రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి ఓడించారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఈ సీటులో హోరాహోరీ పోరు జరిగింది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్కి ఆధిక్యం మూడు పార్టీల మధ్య మారుతూ వచ్చింది. చివరకు కామారెడ్డి ఓటర్ స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు. ఇద్దరు…
Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత తొమ్మిదన్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. నేతలు చేజారిపోవడం, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్కి ఎదురులేకుండా పోయింది.
ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నారు. ఈనెల 3న (ఆదివారం) ఎన్నికల ఫలితాలు రానుండగా.. మంత్రి వర్గ భేటీ ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడే మరుసటి రోజే ఈ సమావేశం నిర్వహిస్తుండటంతో భేటీపై ఆసక్తి నెలకొంది
Shabbir Ali: కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలన్నారు.
CM KCR Cast His Vote: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కేసీఆర్.. తన ఓటు వేశారు. ప్రస్తుతం చింతమడకలో భారీగా ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి రాని ఓటర్లు.. సీఎం వచ్చే టైంలోనే ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. Also Read: Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్…
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పలువురు సీఎం కేసీఆర్తో పాటు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందుకోసం నేతలంతా తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేయనున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ బూతులో ఓటు వేస్తారు. కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావు, మెట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్,…
Vijayashanthi Visits Manthani: ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి మంథని నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన విజయభేరి భారీ బహిరంగ సభలో పాల్గొని ఆమె ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వంలో జరుగుతున్న హింసపై ఆమె మండిపడ్డారు. ‘నిరుద్యోగులను మోసం చేశావు. నేరెళ్లలో ఇసుక లారీ ఘటన.. లాయర్ వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై నరికించి హత్య చేసిన ఘటన. నడిరోడ్డుపై రైతులకు సంకెళ్లు వేసి నడిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముఖ్యమంత్రి చేసి నా గౌరవాన్ని పెంచింది గజ్వేల్ గడ్డ అని తెలిపారు. గజ్వేల్ కి రైలు వస్తుందని అనుకోలేదు కానీ రైలు వచ్చింది.. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు గజ్వేల్ కి వచ్చి మన అభివృద్దిని చూసి వెళ్తున్నారని తెలిపారు. అయ్యింది చాలా గొప్ప అంటే సరిపోదు..ఇంకా చాలా చేయాలన్నారు.…
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ఈ వరంగల్ జిల్లా అని అన్నారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎలక్షన్స్ వస్తే పార్టీకి ఒక్కరు వస్తారని విమర్శించారు. తప్పకుండ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. ఎలక్షన్స్ ఐపోగానే దుకాణం మొదలవుతుంది.. పార్టీల చరిత్రల ఆధారంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.