ఇవాళ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ సీతాకాల సమావేశం జరుగనుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ లో ప్రధానంగా ధరణీలో సమస్యల పరిస్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేష్గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.