6,250 మీటర్ల ఎత్తైన మౌంట్ క్యాంగ్ యాట్సీ-2 అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలబెట్టిన భూక్యా యశ్వంత్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. మహబూబాబాద్ జిల్లాలో మారుమూలన ఉన్న ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన గిరిజన యువకుడు, మౌంటేనీర్ భూక్యా యశ్వంత్.. ఇతను పర్వత అధిరోహణలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించాడు. ఇప్పుడు హిమాలయాల్లో లడఖ్ ప్రాంతంలో ఉన్న 6250 ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించాడు.