చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే…
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (దక్షిణ భారత శాఖ) ఆధ్వర్యంలో చెన్నైలో నేడు, రేపు జరుగబోతున్న సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రాంతీయం కొత్త జాతీయం’ రిపోర్ట్ ను ఆవిష్కరించారు. ‘కళ అంటే కేవలం వినోదమే కాదు, గుట్కా, గంజాయి దురాచారాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రగతిశీల ఆలోచనల ఆధారంగా సామాజిక దురాచారాలను ఎత్తి చూపడమే కళ’…