మరోసారి మణిపూర్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడాన్ని ఆ రాష్ట్ర సర్కారు నిషేధించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.