టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో ఏ ఒక్కరికి అయినా ఇసుక ఉచితంగా ఇచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చేసిన తప్పులకు శేష జీవితంలో చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదు అని ఆయన విమర్శించారు.
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడని మంత్రి సీదిరి అన్నారు. కుప్పంలోనే 30 నుంచి 40వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే భయంతో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ మంత్రి మండిపడ్డారు.
విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు... breaking news, latest news, telugu news, big news, jagananna vidya deevena, chandrababu
ఈ నెల 28 న కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. చంద్రబాబు, నుండి ఆనంద్ బాబు వరకు దొంగ ఓట్ల మాట ఎత్తితే వణికిపోతున్నారని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. దొంగ ఓట్ల తో గెలవాలని చూస్తే ప్రజా స్వామ్యం చూస్తూ ఊరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదని, అందుకే పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. breaking news, latest…