బీజేపీకి ఝార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదు.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాక్లల్లో ఇండియా కూటమి పక్షాన ప్రచారం నిర్వహించారు.