Call Money: రోజు రోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కాల్ మనీ మాయలో పడి ఎంతో మంది బాధితులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా.. ఇలాంటి వారిని నమ్మవద్దని ఎన్ని సలహాలు ఇచ్చినా.. ఇలాంటి వారి నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా..పోలీసులకు ఆశ్రయించాలని చెబుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. కృష్ణా జిల్లాలో కాల్మనీ వ్యవహారం సంచలనంగా మారింది.. కాల్ మనీ మాఫియా వేధింపులు భరించలేక ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం కొండపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ఆయన.. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పుగా తీసుకున్నాడు..…