దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. గురువారం ఉదయం ప్లాట్గా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
సోమవారం ఉదయం నుంచే భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అన్ని రంగాలూ షేర్ మార్కెట్ లాభాల్లో కదలాడుతుంది. కాగా, స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి భారీ లాభాల్లో ఉంది. సుమారు 2,950 పాయింట్ల లాభంతో 82, 404 దగ్గర ముగిసింది సెన్సెక్స్. ఇక, 912 పాయింట్ల లాభంలో 24,920 వద్ద నిఫ్టీ ముగిసింది.
Greg Abel: బిజినెస్ ప్రపంచంలో “వారెన్ బఫెట్” అనే పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, అందుకున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను గుర్తించే విధంగా చేశాయి. బెర్క్షైర్ హాత్వే సంస్థను నిర్మించి, దాన్ని ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన బఫెట్ ప్రస్తుతం 94 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన ఈ సంస్థకు నాయకత్వం వహిస్తూ వ్యాపార రంగంలో అపురూపమైన ముద్రవేశారు. గత పది ఏళ్లుగా బఫెట్…
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. సుంకాలను 90 రోజులు ట్రంప్ వాయిదా వేశారు. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో నూతనోత్సహాన్ని నింపింది. దీంతో అమెరికా మార్కెట్తో పాటు ఆసియా మార్కెట్లు భారీ లాభాలు అర్జిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. గ్రీన్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6 శాతానికి తగ్గినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
Smartphone: భారత్ స్మార్ట్ఫోన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల స్మార్ట్ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఈ ఎగుమతుల్లో దాదాపుగా రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ‘‘ఐఫోన్’’ షిప్మెంట్లు ఉన్నాయని వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో చూస్తే స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 54 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్రమంత్రి అన్నారు. గత 10 ఏళ్లలో భారత దేశంలో ఎలక్ట్రానిక్స్…
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం సరికొత్త కళ సంతరించుకుంది. ట్రంప్ సుంకాలతో సోమవారం ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా మారింది. కానీ కొన్ని గంటల్లోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది.